మా గురించి

క్రైస్తవపరిశుద్ద గ్రంథం చరిత్ర మరియు ప్రవచనం, ఈ రెండింటి గురించీ మనతో మాట్లాడుతుంది. ఇది ఇంతకు ముందు ఏమి వచ్చిందో మరియు త్వరలో ఏమి జరుగనై ఉన్నదో మనకి తెలియజేస్తుంది. ఆశ్చర్యపరిచే ప్రవచనంలో, ప్రపంచ వినాశనానికి ముందు హెచ్చరిక యొక్క చివరి సందేశాన్ని మనం చదవవచ్చు.

ప్రకటన 14లో ముగ్గురు దేవదూతలు వివరించిన ఈ హెచ్చరిక సందేశం మూడు భాగాలుగా వస్తుంది. ప్రపంచం మొత్తం వినడానికి ఈ హెచ్చరికలలో ప్రతి ఒక్కటి కీలకమైనది.

  • ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించాలని మొదటి దేవదూత మనకు చెప్తున్నాడు. మనం సృష్టికర్తను ఆరాధించాలి, ఎందుకంటే ఆయన తీర్పు చెప్పే ఘడియ వచ్చింది. మనము ఈ దేవుణ్ణి ఎలా తెలుసుకోగలమో మరియు తీర్పును దాటి వెళ్ళడానికి ఎలా సిద్ధంగా ఉండాలో మొదటి దేవదూత మనకు చెప్తున్నాడు.

  • రెండవ దేవదూత ముగింపు సమయంలో జరుగబోవు మతభ్రష్టత్వం గురించి హెచ్చరిస్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుణ్ణి మరియు ఆయన వెల్లడించిన వాక్యాన్ని గౌరవించని మత వ్యవస్థల నుండి 'బయటికి రండి' అని మనము చెప్పబడ్డాము.

  • సృష్టికర్త అయిన దేవునికి మరియు ఆయన ప్రజలకు వ్యతిరేకంగా ఒక చివరి దాడిని సృష్టించడానికి మతభ్రష్ట మత వ్యవస్థ ద్వారా దుష్టుడు పని చేస్తాడని మూడవ దేవదూత హెచ్చరిస్తున్నాడు. దుష్టుడిని అనుసరించేవారిపై "గుర్తు" ఉంచబడుతుంది మరియు దేవునికి యథార్థంగా ఉండేవారు హింసించబడతారు. కానీ ఈ భయంకరమైన గుర్తు ఉన్నవారిపై దేవుడు తన తీర్పులను/శాపాన్ని కుమ్మరిస్తాడు. విశ్వాసం మరియు విధేయత కలిగిన ఆయన ప్రజలు, చనిపోతున్న గ్రహం యొక్క నిర్జనము నుండి రక్షింపబడతారు. వారు దేవునితో పరలోకానికి వెళతారు మరియు ఆయన ప్రపంచాన్ని దాని అసలు పరిపూర్ణతలో పునఃసృష్టి చేస్తున్నప్పుడు చూస్తారు.

Sign up for our newsletter

Be the first to know when new publications are available!

newsletter-cover